వేప చెట్టు కింద తలదాచుకున్న వ్యక్తి పిడుగుపాటుకు బలి

by Kalyani |
వేప చెట్టు కింద తలదాచుకున్న వ్యక్తి పిడుగుపాటుకు బలి
X

దిశ, అశ్వారావుపేట: వర్షం చినుకులను తప్పించుకునేందుకు వేప చెట్టు కింద తలదాచుకున్న వ్యక్తి పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లికి చెందిన సాధన రాజారాం(50) అనే తన పొలంలో కూరగాయలను కోసేందుకు వెళ్లాడు. వర్షం మొదలై చినుకులు పడుతూ ఉండడంతో.. సమీపంలోని వేప చెట్టు కింద వేచి ఉన్నాడు. ఇది సమయంలో వేప చెట్టుపై పిడుగు పడటంతో ఆ ధాటికి మృతి చెందాడు. మృతుడు కాంగ్రెస్ పార్టీ గుమ్మడవల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. అనంతరం రాజారాం భౌతికకాయానికి నివాళులర్పించారు. జారె వెంట కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు ఉన్నారు.



Next Story