మట్టి మిద్దె కూలి వ్యక్తి మృతి

by Disha Web Desk 12 |
మట్టి మిద్దె కూలి వ్యక్తి మృతి
X

దిశ, నాగర్ కర్నూల్: పురాతన మట్టి మిద్దె కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లయ్య(40)అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా పురాతన ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వ్యక్తి నిద్రలో ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గతంలోనే నెల క్రితం తాత్కాలికంగా కూలిపోగా అందులో ఎవరు ఉండొద్దని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు.



Next Story

Most Viewed