ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..

by Disha Web Desk 11 |
ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి..
X

దిశ, దుందిగల్: పశువుల కాపరి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన సంఘటన దుందిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూరపల్లి గ్రామానికి చెందిన ఆకుల సురేష్ (26), రోజులాగే ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం పశువులను మేపేందుకు సమీపంలోని చెరువు గట్టుకు వెళ్ళాడు. సాయంత్రం తిరిగి ఇంటికి రావాల్సిన సురేష్ రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గ్రామ పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

ఆందోళన చెందిన కుటుంబ సభ్యుల 26 వ తేదీన ఉదయం దుందిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెరువులో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ మార్చురీకి తరలించినట్లు తెలిసింది. పశువులను మేపే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారిపడినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed