మహాదేవ్ జ్యువెల్లర్స్ చోరీ కేసు : రెక్కీ నిర్వహించే స్కెచ్

by Disha Web Desk 4 |
మహాదేవ్ జ్యువెల్లర్స్ చోరీ కేసు : రెక్కీ నిర్వహించే స్కెచ్
X

దిశ, వెబ్ డెస్క్: మహదేవ్ జ్యువెల్లరీ కాల్పుల కేసు నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సికింద్రాబాద్ నుంచి స్నేహపురి కాలనీ వరకు దుండగులు వెళ్లిన రూట్ మ్యాప్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మహాదేవ్ జ్యువెల్లర్స్ వరకు సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు రికవరీ చేశారు. సప్లయర్ సుఖ్ దేవ్, రాజ్ కుమార్ లపై రెక్కీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి బంగారు ఆభరణాలతో సుఖ్ దేవ్, రాజ్ కుమార్ బయల్దేరారు. బోడుప్పల్, వనస్థలిపురం, పనామా, స్నేహపురి కాలనీలోని జ్యువెల్లరీ షాప్ లకు ఆభరణాలను సుఖ్ దేవ్, రాజ్ కుమార్ సప్లై చేశారు. మహాదేవ్ జ్యువెల్లర్స్ దోపిడికి అనుకూలంగా ఉందని దాడికి తెగబడ్డట్లు పోలీసులు గుర్తించారు. షాప్ లోకి చొరబడి కాల్పులకు పాల్పడి ఆభరణాలతో దొంగలు ఉడాయించారు. నాగోల్ పరిధిలోని ఆభరణాల దుకాణంలో బంగారం దోపిడీ చేయడంతో పాటు దాన్ని అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరిపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.


Next Story