- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాలువలో దూకి జర్నలిస్ట్ ఆత్మహత్య.. తిమ్మాపూర్లో తీవ్ర విషాదం
దిశ, తిమ్మాపూర్: అనారోగ్యం, మానసిక ఆందోళనతో పాత్రికేయుడు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పాత్రికేయునిగా పని చేస్తున్న దురిశెట్టి మహేందర్ రెడ్డి (48) అనారోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం కరీంనగర్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. తెలిసిన వారిని, బంధువులను ఆరా తీసినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదు.
దీంతో బుధవారం ఉదయం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ ప్రమోద్ రెడ్డి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం మట్టేవడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గీసుకొండ వద్ద కాకతీయ కాలువలో మహేందర్ రెడ్డి మృతదేహం లభ్యం కావడంతో కుటుంబ సభ్యులతో సమాచారం ఇచ్చారు. ఈ విషయం తెలిసిన తోటి పాత్రికేయులను తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.