ఆ కేసులో పోక్సో చట్టాన్ని యాడ్ చేసిన పోలీసులు.. కారణం అదే..

by Javid Pasha |
ఆ కేసులో పోక్సో చట్టాన్ని యాడ్ చేసిన పోలీసులు.. కారణం అదే..
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని రోజుల క్రితం విద్యార్థిని మృతి కేసులో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరణించిన విద్యార్థిని మైనర్ కావడంతో ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా యాడ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం జార్ఖండ్‌లో 12 తరగతి విద్యార్థినికి ఓ వ్యక్తి నిప్పంటించాడు, ఆ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలు గాయాల వల్ల మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనలో బాధితురాలి స్టే్ట్‌మెంట్ ప్రకారం యువతికి 19 ఏళ్ల వయసని తెలపబడింది.

కానీ మృతురాలి పదో తరగతి మార్క్ షీట్ ప్రకారం ఆ అమ్మాయి ఇంకా మైనర్ అని తేలింది. దీంతో జార్ఖండ్ పోలీసులు ఈ కేసులో పోక్సో చట్టాన్ని కూడా యాడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా బాధితురాలి వయసు 16 ఏళ్లుగా కమిటీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed