ప్రాణం తీసిన మద్యం 'మత్తు'.. కన్నకూతురి ముందే తల్లి హత్య

by Disha Web Desk 19 |
ప్రాణం తీసిన మద్యం మత్తు.. కన్నకూతురి ముందే తల్లి హత్య
X

దిశ, గీసుగొండ: తాగిన మైకంలో భార్యను కర్రతో కొట్టి భర్త హతమార్చిన ఘటన గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి చెందిన తండా సుమన్‌తో వంచనగిరి గ్రామానికి చెందిన మానస(30)కు గత 15సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి కుమారుడు రితిక్(14) కూతురు రితిక(12) ఉన్నారు. వంచనగిరిలో కుటుంబంతో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది సంవత్సరాల క్రితం సుమన్ తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి కొట్టేవాడు.

ఈ క్రమంలో గురువారం గ్రామంలో గ్రామస్తులంతా వనభోజనాలకు వెళ్లారు. విపరీతంగా తాగి తాగిన మైకంలో ఇంటికి వచ్చిన సుమన్ మానసతో గొడవకు దిగాడు. పంచాయతీ పెద్దది కావడంతో కోపాద్రిక్తుడైన సుమన్ భార్య తలపై విచక్షణరహితంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తల్లి మృతి ఘటన కూతురు కళ్లముందే జరుగుతున్న ఆమె ఏడుస్తూ ఏం చేయలేని పరిస్థితిలో నిర్ఘాంతపోయినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మామునూరు ఏసీపీ నరేశ్ కుమార్, గీసుగొండ సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మృతురాలి సోదరి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నిందితుడు సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed