రోడ్డు ప్రమాదానికి గురైన పంచాయతీ కార్మికురాలు

by Disha Web Desk 20 |
రోడ్డు ప్రమాదానికి గురైన పంచాయతీ కార్మికురాలు
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలంలోని గోవింద్ పెట్ గ్రామపంచాయతీకి చెందిన పంచాయతీ కార్మికురాలు పోసాని శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురైంది. గ్రామంలో పంచాయతీ పారిశుద్ధ్య పనుల్లో ఉన్న పోసానిని రోడ్డు పై వస్తున్న ఆటో ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన స్థానికుకు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని మనోరమ ఆసుపత్రికి తరలించారు.

కాగా బాధితురాలి కుటుంబసభ్యులు ఆమె వైద్యఖర్చుల నిమిత్తం గ్రామసర్పంచ్ బండమీది జమున గంగాధర్ ను కలిసి సాయం అందించాలని కోరినట్లు సమాచారం. ఆమె గోవింద్ పేట్ గ్రామపంచాయతీలో 36 సంవత్సరాలుగా పంచాయతీ కార్మికురాలుగా పనిచేస్తున్న విషయాన్ని గమనించి గ్రామంలోని ఉన్నత స్థానాల్లో స్థిరపడిన వారు సహృదయంతో సాయం అందించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.


Next Story

Most Viewed