బ్రేకింగ్ : విశాఖ - కిరండూల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : విశాఖ - కిరండూల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ - కిరండూల్ రైల్వే లైన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండూల్ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ మార్గంలో రైలు పట్టాలు తప్పడం ఇది రెండోసారి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే సిబ్బంది యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Next Story