సత్యసాయి జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసిన దుండగులు

by Disha Web Desk |
సత్యసాయి జిల్లాలో దారుణం.. మహిళను హత్య చేసిన దుండగులు
X

దిశ, వెబ్‌డెస్క్ : కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామ శివారుకు వెళ్లిన మహిళ దారుణ హత్యకు గురైంది. ఒంటరిగా ఉన్న ఆమెపై దుండగులు రాళ్లతో మోది అత్యంత కృూరంగా హత్య చేశారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బోయ అక్కులప్ప భార్య మమత (35) బుధవారం ఉదయం బహిర్బూమికని ఒంటరిగా బయటకు వెళ్లింది. అలా వెళ్లిన ఆమె ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం వెతకగా గ్రామ శివారులోని చెట్ల మధ్యలో మమత పడిపోయి కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా.. ఆమె తలపై రాళ్లతో దాడి చేసిన ఆనవాళ్లతోపాటు దుస్తులు చెదిరిపోయి ఉన్నాయి. బండరాళ్లపై తలపై బలంగా మోదడంతో మమత అక్కడికక్కడే హతమైనట్లు తెలుస్తోంది. రక్తం మరకలతో ఉన్న రాళ్లు సైతం మృతదేహం పక్కన్నే ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమికంగా హత్య జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఏ కోణంలో జరిగింది అన్న విషయం పై ఆరా తీస్తున్నారు. బఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed