జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

by Aamani |
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
X

దిశ,అడ్డాకుల : మండలంలోని కందూరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గా జాతీయ రహదారి కందూర్ స్టేజ్ వంతెనపై కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ కు వెళ్లే మార్గంలో స్కూటీ వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం అధిగమించేందుకు దారి లేక సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి డీసీఎంను ఢీ కొట్టుంది. అదే వైపు నుంచి వస్తున్న లారీ వెనుక వైపు నుంచి కారును ఢీ కొట్టడంతో డీసీఎం లారీ మధ్యలో కారు మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న మహిళ శోభారాణి (50) మృతి చెందగా, ఆమె భర్త ఎల్లారెడ్డికి, శోభారాణి తల్లి విమలకు, డ్రైవర్‌కు గాయలైనట్లు తెలిపారు. ముందు ఉన్న స్కూటీని డీసీఎం ఢీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న రఘుపతి రెడ్డి కూడా గాయాలయ్యాయి.

బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్, మూసాపేట ఎస్సై వేణు సిబ్బంది ఎల్ అండ్ టి సిబ్బంది, క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారులో వెళ్తున్న వారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లికి చెందిన వారుగా హైదరాబాద్‌లో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వెళుతున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed