కందనూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

by Disha Web Desk 4 |
కందనూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాను వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను హుటాహుటిన నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

రెండు వాహనాలు పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందినవే అని తెలిసింది. కాగా కొల్లాపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పట్టణానికి వస్తున్న తుఫాన్‌ను ఢీ కొట్టింది. దీంతో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story