ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం

by Disha Web Desk 12 |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం
X

దిశ, పెనుబల్లి : మండల పరిధిలోని విఎం బంజర్ సత్తుపల్లి రోడ్డు‌లోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి 10: 30 నిమిషాలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీ కొనడంతో రెండు లారీల డ్రైవర్లు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. పోలీసులు సుమారు రెండు గంటలు శ్రమించి క్యాబిన్‌లో ఇరుక్కున్న ఇద్దరూ డ్రైవర్లను బయటకు తీసే సమయానికి ఇద్దరు కొన ఊపిరి ఉండడంతో, సమీపంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే సమయంలో మరణించినారు. ఈ సంఘటనతో ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు సుమారు మూడు గంటల సేపు స్తంభించిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed