- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఎనిమిదో తరగతి బాలికపై తోటి విద్యార్థులు క్లాస్ రూమ్లో అత్యాచారం..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల సమాజంలో మానవత్వం మంట కలిసి పోయింది. అమ్మాయిలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్ద ముసలి ముతగా అన్న తేడా లేకుండా వారిపై కామాంధులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఆడపిల్లలకు ఇంట బయటా రక్షణ కరువైంది. పెద్ద వారిని చూసి మైనర్ బాలుర్లు సైతం అమ్మాయిల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది దుర్మార్గులు వారు చెప్పినట్టు వినకపోతే హత్య చేయడానికి కూడ వెనకాడటం లేదు. ముంబైలోని ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులు క్లాస్ రూమ్లో అత్యాచారం చేసిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చి కలకలంగా సృష్టించింది.
వివరాల ప్రకారం.. ముంబైలోని హార్బర్ లైన్లో ఉన్న ఓ పాఠశాలలో అందరు విద్యార్థులు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్లారు. అయితే ఓ ఎనిమిదవ తరగతి చదువున్న బాలిక మాత్రం క్లాస్ రూమ్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో అదే అదునుగా భావించి తోటి విద్యార్థులు ఇద్దరు ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు వారి బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఇద్దరు మైనర్ బాలురలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.