ఢిల్లీ మర్డర్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు..

by Disha Web Desk 4 |
ఢిల్లీ మర్డర్ కేసు : వెలుగులోకి సంచలన విషయాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధానిలో కలకలం సృష్టించిన పదహారేళ్ల బాలిక మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 16 ఏళ్ల బాలికను 20ఏళ్ల సాహిల్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి, కాంక్రిట్ స్లాబ్ తో దాడి చేసి చంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే మైనర్ బాలిక సాహిల్‌తో రిలేషన్ షిప్‌ను ముగించుకోవాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన నిందితుడు సాహిల్ ను యూపీ బులంద్షార్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు.

అనంతరం నిందితుడిని మంగళవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో హాజరు పర్చారు. నిందితుడిని పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకున్నారు. మైనర్ బాలికకు నిందితుడికి సంబంధాలు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. సాహిల్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, నిందితుడితో సంబంధాలు ముగించుకోవాలని మృతురాలు భావించినట్లు తెలిపారు. ఇదే విషయమై చంపేస్తానని సదరు మైనర్ బాలికను సాహిల్ హెచ్చరించాడు. తనతో రిలేషన్ షిప్ కొనసాగించాలని యువతిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. కానీ మైనర్ బాలిక వినలేదు. అని ఓ అధికారి తెలిపాడు.


Next Story

Most Viewed