అశోక సాగర్ లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 20 |
అశోక సాగర్ లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం..
X

దిశ, నిజామాబాద్ క్రైం : ఆశోక్ సాగర్ లో అక్కచెల్లెళ్లు వారి ముగ్గురు పిల్లలతో పాటు దూకి అత్మహత్యాయత్నం చేసుకునే ప్రయత్నం చేయగా వారిలో బాలుడు గల్లంతయ్యాడు. కాగా గల్లంతైన బాలుడి మృత దేహం శనివారం లభ్యమైందని ఆరవ టౌన్ ఎస్సై సాయి కుమార్ తెలిపారు. శుక్రవారం దుబ్బకు చెందిన త్రివేణి తన కొడుకు నమోతో, అదే విధంగా నికితతన కొడుకు భవ్యష్, కూతురు క్షేమలను తీసుకుని వచ్చి ఆశోక్ సాగర్ లో దూకి అత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసిందే.

అక్కడ స్థానికులు త్రివేణి తన కొడుకు నమో, నికిత తన కొడుకు కూతురు క్షేమలను కాపడగా నీటమునిగి భవ్యేష్ (5) గల్లంతైన విషయం తెలిసింది. ఈ కేసులో త్రివేణి, నిఖితల తండ్రి కౌడపు మోహన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు తెలిపారు. త్రివేణి, నిఖితలను వారి భర్తలు కట్నం కింద ఇచ్చిన 200 గజాల స్థలం అమ్ముకు రావాలని తీవ్ర ఇబ్బందులకు గురి చేయ్యడంతోనే వారు అత్మహత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed