కూకట్‌పల్లిలో దంపతుల సూసైడ్..

by Disha Web Desk 4 |
కూకట్‌పల్లిలో దంపతుల సూసైడ్..
X

దిశ, కూకట్ పల్లి: అనారోగ్య కారణాలతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్ పల్లి వెంకట్రావు నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సోమిరెడ్డి(65), మంజుల(58) దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

సోమిరెడ్డి, మంజుల దంపతులకు ఇద్దరు సంతానం ఒకరు విదేశాలలో స్థిరపడ్డారు. మరొక కొడుకు మియాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సోమిరెడ్డి, మంజుల మంగళ వారం అర్ధ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాల వల్లే ఆత్మ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Next Story

Most Viewed