బీరు సీసాలతో దాడి చేసుకున్న కాంట్రాక్టర్లు

by Nagaya |
బీరు సీసాలతో దాడి చేసుకున్న కాంట్రాక్టర్లు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆర్థిక లావాదేవీల కారణంగా ఇరువురి మధ్య జరిగిన గొడవ ప్రాణాపాయ స్థితికి చేర్చింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో వార్డ్ మెంబర్ జవ్వాజి లింగం, బండలింగంపల్లికి చెందిన నారాయణరెడ్డి మధ్య కాంట్రాక్టు లెక్కల విషయంలో వచ్చిన తగాదాలో ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. లింగం వార్డు మెంబర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed