ఉరి వేసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే

by Sumithra |
ఉరి వేసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే
X

దిశ,తల్లాడ : కుర్నవల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆయిలూరి శశి రెడ్డి ఆయన భార్య ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు కాగా వీరిలో ఆయిలూరి భావన (22)రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది. ఉన్నట్టుండి శనివారం ఉదయం 10 గంటల సమయంలో హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని ఆత్మహత్య పై ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదు. ఆమె మృతిపై కుర్నవల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.



Next Story

Most Viewed