పరువుహత్య కలకలం

by Disha Web Desk 4 |
పరువుహత్య కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా చంద్రగిరిరెడ్డి వారి పల్లెలో పరువు హత్య కలకలం రేపింది. ఇంటర్ విద్యార్థిని మోహనకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంజనేయపురానికి చెందిన యువకున్ని యువతి ప్రేమించగా సదరు యువకుడు ప్రేమపెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు మొదట తెలిపారు. దీంతో పోలీసులు ఆత్మహత్య, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసారు. కాగా తాజాగా వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం గొంతు నులిమి చంపినట్లు వెల్లడైంది. దీంతో కుటుంబసభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. డీఎస్పీ స్థాయి అధికార ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. జూలై 7న ప్రేమ విఫలమై ఉరి వేసుకుని చనిపోయిందని తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. కాగా పోస్ట్ మార్టం చేసిన వైద్యులు మోహన కృష్ణది ఆత్మహత్య కాదని హత్య అని తేల్చారు. కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగికరీంచలేదని తెలుస్తోంది. అయిన మోహన కృష్ణ వినకోపోవడంతో తల్లిదండ్రులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు పోలీసులు అనుమానుస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed