బీరిశెట్టిగూడెం సర్పంచ్ ఆత్మహత్యాయత్నం కలకలం

by Disha Web Desk |
బీరిశెట్టిగూడెం సర్పంచ్ ఆత్మహత్యాయత్నం కలకలం
X

దిశ, దంతలపల్లి : దంతాలపల్లి మండలంలోని బీరిశెట్టి గూడెం సర్పంచ్ నెహ్రూ నాయక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక ఉపసర్పంచ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తుల వేధింపులతోనే తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని సర్పంచ్ తల్లి పీప్లా ఆరోపించారు. గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులపాలయ్యాడని, దీంతో ఆర్థికంగా చితికి పోయాడని కన్నీరుమున్నీరు అయ్యారు. నెహ్రూ నాయక్‌కు ప్రస్తుతం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందిస్తున్నారు. సర్పంచ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed