ఈ దారుణాలు ఆగేనా.. ఏపీలో మరో మహిళపై అత్యాచారయత్నం.. అక్కడికి తీసుకెళ్లి మరీ

by Dishanational2 |
ఈ దారుణాలు ఆగేనా.. ఏపీలో మరో మహిళపై అత్యాచారయత్నం..  అక్కడికి తీసుకెళ్లి మరీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో వరసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులనేవి ఆగడం లేదనడానికి విజయవాడ ఆసుపత్రిలోని ఘటనే నిదర్శనం. అంతే కాకుండా గుంటూరులో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని దుగ్గిరాల మండలంలోని ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారాని యత్నించారు. ఓ గ్రామానికి కూలి పనికోసం వచ్చిన మహిళలు, గ్రామంలోని ఆలయంలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఓ మహిళను పొలాల్లోకి లాకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కుడున్నవారు అలర్ట్ అయ్యారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed