- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భర్త కోరికను నిరాకరించిన భార్య.. తట్టుకోలేని అతడు..
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహాజం. దానికి కొంత మంది కోపోద్రిక్తులవుతూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది భర్తలకు తమ భార్యలు బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడం నచ్చడం లేదు. ఈ క్రమంలో తరచూ గొడవలు పడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, బీహార్లో ఓ ఘటన జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బీహార్లోని సిర్హల్ అనే గ్రామంలో సీతా దేవి అనే మహిళ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తుంది. అయితే ఆమెకు కొంతకాలం క్రితం మహేష్ రామ్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సీత ఉద్యోగం చేయడం మహేష్కు ఇష్టం లేదు. ఈ విషయంపై మహేష్ తన భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక గత ఏడాది కాలంగా పిల్లలతో కలిసి దూరంగా వచ్చి ఉంటోంది. ఈ క్రమంలో సీత దగ్గరకు మహేష్ గత గురువారం వెళ్లాడు. సీతదేవిని ఉద్యోగం మానేసి తనతో కలిసి ఉండమని కోరాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఆగ్రహించిన మహేష్, సీతను కత్తితో అనేకసార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సీతాదేవి నొప్పితో కేకలు వేయడంతో, స్థానికులు వచ్చి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందిన అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.