- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సిరిసిల్లలో స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రైవేట్ స్కూల్ బస్ను ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. మంగళవారం ఉదయం విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ను వెనక నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్లో ఉన్న 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజ్ఞాన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్, రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరిగి సిరిసిల్లకు వస్తుండగా.. ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపు వద్ద ఆర్టీసీ బస్సు వెనక నుండి వచ్చి ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్లో ఉన్న విద్యార్థులు ఒకరి మీద మరొకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్కూల్ యజమాని ఎండి లతీఫ్ విద్యార్థులను వెంటనే స్థానిక అశ్విని హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. కాగా, ఆర్టీసీ బస్సు అతివేగంతో దూసుకు వచ్చి స్కూల్ బస్ను ఢీ కొట్టిందని సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు తెలిపారు.