- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రేమ పెళ్లి చేసుకున్నారని యువతి ఎదుటే అక్కడ కొరికి.. యువకుడిపై దాడి
దిశ, ఏపీ బ్యూరో : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి తండ్రి, తమ్ముడు కలిసి దాడి చేశారు. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి శివార్లలోని ఓ రెస్టారెంట్లో జరిగిందీ ఈ ఘటన. దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన సాంబశివరావు, పావని మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పావని కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా వారిని విడదీయాలనే ఉద్దేశంతో వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో రహస్యంగా తెలుసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓ రెస్టారెంటులో ఉన్నారనే సమచారంతో అక్కడికి వెళ్లి పావని భర్త సాంబశివరావుపై దాడి చేశారు. ముందుగా సాంబశివరావు తలను టేబుల్ కేసి కొట్టారు. అదే ఊపులో చెవి కొరికేసి అనంతరం కర్రలతో దాడి చేశారు. దీంతో గాయపడిన ప్రేమజంట ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.