- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు.. మహిళను కొట్టి చంపేన పక్కింటి వ్యక్తులు?
దిశ, కదిరి : వాషింగ్ మెషిన్ నుంచి వచ్చే వృథా నీటి విషయంలో రెండు కుటుంబాలు మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. కూర్చోని మాట్లాడుకుంటే సమసిపోయే చిన్న వివాదంలో మాటమాట పెరిగి మహిళపై మూకుమ్మడిగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే హతమైంది. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కదిరి పట్టణంలోని మశానంపేటలో డాన్స్ మాస్టర్ రాజేష్, అతని భార్య పద్మావతి ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆమె ఇంట్లోని వాషింగ్ మెషిన్ నుంచి వచ్చే వృథా నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటి ముందుకు వెళ్లింది. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి వేమన్న నాయక్ కుటుంబ సభ్యులు పద్మావతిపై బండ రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితురాలిని కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించగా... ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పద్మావతి మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ తమ్మిశెట్టి మధు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.