- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రైల్వే పోలీసులు తరుముతుండగా బావిలోపడి మహిళ మృతి..
by Disha Web Desk 4 |
X
దిశ, నెక్కొండ: నెక్కొండ మండలంలో ఓ మహిళ రైల్వే పోలీసుల నుండి తప్పించుకోబోయి వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం ఇస్లావత్ తాండాకు చెందిన అజ్మీర వాలి (40) నెక్కొండ మండలం వాగ్యానాయక్ తాండాకు చెందిన కేళి, పద్మ, దీక్షకుంట గ్రామానికి చెందిన రాకేశ్ ఈ నెల 30 తేదీన నిషేధిత నల్లబెల్లంతో ఢిల్లీ నుండి పాండిచ్చేరి వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ బల్లార్షలో ఎక్కారు.
రైల్వే పోలీసులు తనిఖీ నిర్వహించారు. అది గమనించిన గిరిజన మహిళలు ఎలుగూరు-నెక్కొండ స్టేషన్ మధ్యలో ట్రైన్ దిగి బెల్లం మూటలతో పరుగెత్తారు. పోలీసులు వారిని వెంబడించగా ప్రమాదవశాత్తు వాలి వ్యవసాయ బావిలో పడి మృతిచెందింది. కేళికి గాయాలయ్యాయి. వాలి భర్త శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story