అమానవీయ ఘటన: తల్లిపై కన్న కూతురు కర్కశత్వం.. (వీడియో)

by Disha Web Desk 19 |
అమానవీయ ఘటన: తల్లిపై కన్న కూతురు కర్కశత్వం.. (వీడియో)
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కాళ్ల కడియాలు, పింఛన్ డబ్బుల కోసం సొంతం తల్లినే ఓ కూతురు దుర్భాషలాడుతూ, చితకబాదిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. చంద్రమ్మ అనే వృద్ధురాలు తన ఏకైక కూతురు ఇంటి వద్దనే ఉంటూ జీవనం సాగిస్తోంది. తాగుడుకు బానిసైన కూతురు పింఛన్ డబ్బుల కోసం మంగళవారం తల్లితో గొడవకు దిగింది. ఈ క్రమంలోనే తల్లి కాళ్లకున్న కడియాలను లాక్కోవడంతో పాటు, ఆమెను ఇష్టారీతిగా దుర్భాషలాడుతూ, వృద్ధురాలు అని కూడా చూడకుండా రాళ్లతో కొట్టింది.

ఈ క్రమంలో అటువైపుగా కొందరు ఆ దృశ్యాలను వీడియోగా తీయడంతో పాటు.. పోలీసులకు చెబుతామని బెదిరించినప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా ఆ మహిళ తన తల్లిని అలాగే కొడుతూ ఉంది. ఆ మహిళ తన తల్లిని కొడుతోన్న సమయంలో పక్కనే ఉన్న ఓ పిల్లవాడు వృద్ధురాలు చేతులను పట్టుకోవడం.. అక్కడే ఉన్న అల్లుడు తనకు ఏమి పట్టదన్నట్లుగా వ్యవహరించాడు. దీంతో అక్కడే ఉన్నా కొందరు ఆ వృద్ధురాలిని రక్షించి.. పోలీసులకు సమాచారం అందించారు. కాగా, డబ్బు కోసం కన్నపేగు బంధాన్ని మరిచి ఆ మహిళ వృద్ధురాలైన తల్లిన కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed