- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
సహాయం చేసి మృత్యు ఒడిలోకి చేరిన విద్యార్థి..
by Sumithra |
![సహాయం చేసి మృత్యు ఒడిలోకి చేరిన విద్యార్థి.. సహాయం చేసి మృత్యు ఒడిలోకి చేరిన విద్యార్థి..](https://www.dishadaily.com/h-upload/2023/05/26/218713-web-image-3008.webp)
X
దిశ, పెద్దపల్లి : రైలు ప్రయాణంలో తాను కూర్చున్న సీటు ఓమహిళకు ఇచ్చిన విద్యార్ధి ప్రమాదాశాత్తు రైలు నుంచి జారీపడి మరణించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం ఐబీ ప్రాంతానికి చెందిన ఆవిడపు రోహిత్ (22) అనే విద్యార్ధి శుక్రవారం ఉదయం బల్లార్షా సిక్రిందాబాద్ మధ్య నడిచే రైలులో హైదరాబాద్ కాలేజీకి బయలుదేరాడు.
మార్గ మధ్యలో తాను కూర్చున్న సీటును ఓమహిళకు ఇచ్చిన రోహిత్ బోగి డోర్ వద్ద నిలుచున్నట్లు తోటి ప్రయాణికులు తెలిపారు. ప్రమాదావశాత్తు రోహిత్ పెద్దపల్లి రైల్వేస్టేషన్ తరువాత కూనారం రైల్వే గేటు సమీపంలో రైలు నుంచి జారీ పడ్డాడు. తీవ్ర గాయాలు అయిన రోహిత్ మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాపు చేస్తున్నారు.
Next Story