బ్రిడ్జికి ఉరి వేసుకుని గోదావరిలో దూకిన ప్రైవేట్ ఉద్యోగి

by Disha Web Desk |
బ్రిడ్జికి ఉరి వేసుకుని గోదావరిలో దూకిన ప్రైవేట్ ఉద్యోగి
X

దిశ, అల్లవరం: గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జికి ఉరి బిగించుకోని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బొడశకుర్రు వద్ద వైనుతేయ గోదావరి బ్రిడ్జిపై ఈ ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అతడి ఐడీకార్డు ఆధారంగా మృతుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కిపురం మండలం గూడపల్లికి చెందిన డి.నాగ శంకర గణేష్‌గా గుర్తించారు. మృతుడు అమలాపురంలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అల్లవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పైకి తీశారు. బ్రిడ్జి పైనుండి నుండి ఉరివేసుకుని గోదావరి నదిలోనికి వేలాడుతున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed