కొడవలూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్ బీభత్సం.. 15 మందికి గాయాలు

by Disha Web Desk |
కొడవలూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్ బీభత్సం.. 15 మందికి గాయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా కొడవలూరు జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యాన్, ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ పలువురు తీవ్రంగా గాయపడగా.. 6 గొర్రెలు మృతి చెందాయి. శుక్రవారం తెల్లవారుజామున 04:00 గంటల సమయంలో కొడవలూరు మండలం నాయుడుపాలెం సమీపంలో NH16 పైన కావలి నుండి నెల్లూరు వైపు వెళుతున్న Ap39 EY8558 రొయ్యలు వ్యాన్ రోడ్డుకు అడ్డంగా వచ్చిన గొర్రెలను తప్పించే క్రమంలో బండిని స్లో చేయగా అదే సమయంలో వెనుక నుండి వేగంగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వ్యానును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో సుమారు 15 మంది గాయపడ్డారు. 6 గొర్రెలు చనిపోయాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.



Next Story