భవనం పైనుంచి దూకి వివాహిత మృతి.. ఆత్మహత్య చేసుకుందా..? భవనం పైనుంచి తోసేసారా?

by Disha Web Desk 12 |
భవనం పైనుంచి దూకి వివాహిత మృతి.. ఆత్మహత్య చేసుకుందా..? భవనం పైనుంచి తోసేసారా?
X

దిశ, పేట్ బషీరాబాద్: భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ పరిధిలో ఉన్న శ్రీ సాయి కాలనీలో ఉంటున్న గంగా ప్రసాద్, శైలు (20) లకు ఇటీవల వివాహం అయ్యింది. కాగా గురువారం తెల్లవారుజాము సమయంలో శైలు రెండు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భార్య భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే శైలు ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. అయితే శైలు నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా మరి ఎవరైనా కావాలని కిందకి తోసేసారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read....

ఇద్దరు కూతుళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి..!!


Next Story

Most Viewed