- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పండగ పూట విషాదం.. పూల కోసం వెళ్లి అనంతలోకాలకు..
దిశ, ఏటూరునాగారం: సద్దుల బతుకమ్మ పండగ వేళ పూల కోసం వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందిన విషాద సంఘటన మండల కేంద్రంలో నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ మద్దికుంట గ్రామానికి చెందిన వీరవేణి శ్రీను(28) అనే వ్యక్తి సద్దుల బతుకమ్మ పండుగకు ఏటూరునాగారంలోని తన మామా బాస బాబు ఇంటికి వచ్చాడు. కాగా, బతుకమ్మ పండుగకు కావాలసిన పూల కోసం స్థానిక గ్రామమైన అల్లావారి ఘణపురం వద్ద గల మారెడు బావి అనే చెరువులోకి పూల కోసం వెళ్లి గల్లంతు అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏస్సై డి. రమేష్ సంఘటన స్థలానికి చేరుకోని గాలింపు చర్యలు చేపట్టగా.. శ్రీను మృత్యదేహం లభ్యమైంది. కాగా పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం ఏటూరునాగారంలోని సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు శ్రీనుకు 6 నెలల క్రిందట వివాహం అయినట్టు సమాచారం.