లారీ ఢీకొని వ్యక్తి మృతి

by Disha Web Desk 12 |
లారీ ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, భీమదేవరపల్లి: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని ముల్కనూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామానికి చెందిన పురాణం జంపయ్య, రాజు కలిసి బుధవారం రాత్రి స్కూటీ పై ఇంటి నుంచి బస్టాండ్ కి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తా సమీపంలో హన్మకొండ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఢీ కొనగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 కి ఫోన్ చేసి క్షతగాత్రులను హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జంపయ్య(37) చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య,ఇద్దరు కుమారులు ఉన్నారు.


Next Story

Most Viewed