30 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

by Dishafeatures2 |
30 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ, గూడూరు: అక్రమంగా దాచి ఉంచిన రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలోని గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందని బానోతు చంద్రు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి అక్రమంగా తన ఇంట్లో నిల్వ ఉంచాడు. సమాచారాన్ని అందుకున్న సివిల్ సప్లై అధికారులు డిప్యూటీ తహసీల్దార్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సదరు వ్యక్తి ఇంట్లో దాడి చేసి 30 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంత బియ్యం నిందితుడు బానోతు చంద్రు ఎవరెవరి నుంచి కొనుగోలు చేశారనే విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల అర్ఐ మల్లయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


Next Story

Most Viewed