ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది స్పాట్ డెడ్

by Disha Web Desk 19 |
ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాజధాని లిమాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed