బ్రేకింగ్ న్యూస్.. నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి

by Disha Web Desk 12 |
బ్రేకింగ్ న్యూస్.. నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నదిలో పడవ బోల్తా పడి సుమారు 23 మంది మృతి చెందారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 100 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కవుగా మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనలో అనేక మంది గల్లంతైనట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story