మహాసభలను జయప్రదం చేయండి: జగన్

by  |
jagan-2
X

దిశ, యాచారం: సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ మండల కమిటీ సభ్యులు కావలి జగన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం మహాసభలను జయప్రదం చేయడం కోసం మండల పరిధిలోని కొత్తపల్లిలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎం రాజీలేని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖా కార్యదర్శులు కృష్ణ, జంగయ్య, పార్టీ శాఖ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

yacharam-1


Next Story

Most Viewed