- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
![నకిలీ చలానాల కుంభకోణం కేసు.. ముగ్గురు అరెస్ట్ నకిలీ చలానాల కుంభకోణం కేసు.. ముగ్గురు అరెస్ట్](https://www.dishadaily.com/wp-content/uploads/2021/08/gf.jpg)
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ చలానాల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేశారు. ఈ నకిలీ చలానాల వ్యవహారం బయటపడిన కడపలో ముగ్గురు స్టాంప్ రైటర్లను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారు జింకా రామకృష్ణ, అనములు లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు కడప అర్బన్, రూరల్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రూ.కోటి 3 లక్షలు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story