మీర్‌పేట్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన కార్పొరేటర్.. మంత్రి సమక్షంలోనే..

by  |
bjp
X

దిశ, జల్‌పల్లి: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు బీజేపీ కార్పొరేటర్ మొక్క నరేంద్రకుమార్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నరేంద్రకుమార్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దీప్లాల్ చౌహాన్, కొవ్వూరు రాకేష్, మాధరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story