'విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి'

by Dishanational2 |
విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్​లాండ్​ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి భారత్​కు వచ్చే ప్రయాణికులు తమ ఆర్​టీపీసీఆర్ రిపోర్టును తప్పనిసరి ఎయిర్ సువిధ పోర్టల్​లో అప్లోడ్ చేయాలని సూచించింది. జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 2శాతం మంది ప్రయాణికులకు ర్యాండమ్​గా చేస్తున్న పరీక్షలకు ఇది అదనంగా ఉంటుందని కేంద్రం తెలిపింది.


Next Story

Most Viewed