చాపకింద నీరులా మహమ్మారి! తాజాగా 11 వేలు దాటిన కొత్త కేసులు

by Disha Web Desk 6 |
చాపకింద నీరులా మహమ్మారి! తాజాగా 11 వేలు దాటిన కొత్త కేసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత దేశంలో మరోసారి కరోనా వైరస్ పంజా విసురుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,109 పాజిటివ్ కేసులో కొత్తగా నమోదు కాగా వైరస్ బారిన పడి 29 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 236 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,47,97,269 కు చేరగా, మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,064 కు చేరుకుంది. ప్రస్తుతం 49,622 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతంగా నమోదైందని కేంద్రం వెల్లడించింది.

Next Story

Most Viewed