కరోనా పంజా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు

by Disha Web Desk 2 |
కరోనా పంజా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: చాపకింద నీరులాగా కరోనా మహమ్మారి మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 748 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతిచెందారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్‌లో ఒకరు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3420 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తు్న్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.


Next Story

Most Viewed