ఆఖరికి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా వదలని కరోనా

by  |
ఆఖరికి ఖైరతాబాద్ వినాయకుడిని కూడా వదలని కరోనా
X

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజానికం ఆందోళనకు గురవుతోన్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇలా ఒక్కటని కాదు.. ప్రతి ఒక వ్యక్తి, ప్రతి రంగం, ప్రతి అంశంపై కరోనా తన ప్రభావాన్ని చూపింది. అంతేకాదు దేశవ్యాప్తంగా పేరు గాంచిన ఖైరతాబాద్ వినాయకుడిని కూడా కరోనా వదలేదు. కరోనా కారణంగా ఖైరతాబాద్‌ వినాయక ఉత్సవ కమిటీ.. విగ్రహం ఎత్తుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కేవలం ఒక్క అడుగు ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించింది. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున భారీ విగ్రహాన్ని ఏర్పాటును విరమించకున్నట్లు కమిటీ తెలిపింది. ఈనెల 18న నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు వివరించింది.



Next Story

Most Viewed