- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండగను గురువారం సంబురంగా నిర్వహించాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో వర్గపోరు బయట పడింది. రెండు గ్రూపుల వారు పార్టీ జెండా ఎగరవేయడానికి పోటీ పడి గొడవకు దిగారు. ఒకరినొకరు దూషించుకుని ఆధిపత్యం కోసం నినాదాలు చేశారు. కొంత సేపు ఘర్షణకు దిగి చివరకు గ్రూపులతో సంబంధం లేని పార్టీ మాజీ అధ్యక్షుడి చేత జెండా అవిష్కరించారు.
అయితే ఈ గలాటా కారణంగా పార్టీ జెండాను రివర్స్లో ఎగరేసిన నాయకులు, అంతలోనే తేరుకొని జెండాను సరిచేశారు. అదేవిధంగా సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామంలో పార్టీలో ఉన్న వర్గ పోరు కారణంగా ఎవరు కూడా పార్టీ జెండా ఎగర వేయలేదు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గ్రూపు విభేదాల కారణంగా కొన్ని చోట్ల పార్టీ జెండాను ఎగరవేయక పోగా, మరికొన్ని ప్రాంతాల్లో రెండేసి చోట్ల జెండా పండుగ జరుపుకున్నట్లు సమాచారం.