అలంపూర్ టీఆర్ఎస్‌లో ముసలం.. కేటీఆర్‌కు షాక్..

by  |
అలంపూర్ టీఆర్ఎస్‌లో ముసలం.. కేటీఆర్‌కు షాక్..
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లుగా అలంపూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు ప్రకటించారు. అలంపూర్ కు మంజూరు అయిన వంద పడకల ఆస్పత్రిని అలంపూర్ చౌరస్తా కు తరలించడం పట్ల నిరసనను వ్యక్తం చేస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.

ఈ మేరకు సోమవారం వారు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అలంపూర్ కు వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తే, పలువురు నాయకులు వ్యూహాత్మకంగా అలంపూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌరస్తా కు తరలించడం అన్యాయమన్నారు. గత రెండు నెలలుగా అలంపూర్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ మేరకు ఆదివారం అలంపూర్ బంద్ కూడా నిర్వహించామని తెలిపారు.

ప్రజల నుండి వస్తున్న నిరసనలు, అఖిలపక్ష కమిటీ నుండి వస్తున్న ఒత్తిడి మేరకు ప్రజా ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు గద్వాల జోగులాంబ జిల్లా లోనూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం కేటీఆర్ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. దీనితో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.


Next Story

Most Viewed