టీఆర్ఎస్ నేత కేకే కూతురు దౌర్జన్యం

by  |
టీఆర్ఎస్ నేత కేకే కూతురు దౌర్జన్యం
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూతురు విజయలక్ష్మి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న విజయలక్ష్మి.. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలాయానికి వెళ్లి హల్ చేశారు. తన అనుచరులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డిని బెదిరించారు. హైకోర్టుకు వెళ్లాల్సిన తనను అడ్డుకొని, కార్యాలయంలో దూర్భాషలు ఆడారని తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎవరనుకుంటున్నారని, టీఆర్ఎస్ నేత కేకే కూతురునని చెప్పి దుర్భాషలాడారని తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


Next Story

Most Viewed