- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజురాబాద్: అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ కానీ అతని అనుచరులు కానీ బహిరంగ చర్చకు ఎందుకు రాలేదని హుజురాబాద్ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఈటల కొనుగోలు చేసిన భూములపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేసి తాము ముందుగానే అక్కడకు చేరుకున్నామన్నారు. ఇదే అంబేడ్కర్ సాక్షిగా పలమార్లు సీఎం కేసీఆర్ ను కొనియాడిన ఈటల ఇప్పుడు ఆరోపణలు చేస్తుండడం సమంజసం కాదన్నారు.
2003 లో కమలాకపూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టిన రాజేందర్ టీఆర్ఎస్ నాయకునిగానే వచ్చారు. కానీ రాజేందర్ వల్ల ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పట్టు సాధించలేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. తాను చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు బహిరంగ చర్చకు వస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు.