బొగ్గు కొనుగోలుకు నిధుల కొరత లేదు: సీఎం వైఎస్ జగన్

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో బొగ్గు కొనుగోలుకు ఎలాంటి నిధుల కొరత లేదని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని కరెంటు పరిస్థితులపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో జగన్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ థర్మల్‌ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. థర్మల్‌ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలన్నారు. ఎలాంటి నిధుల కొరత లేదని, ఇప్పుడున్న థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలన్నారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ల్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించాలని, తద్వారా 1600 మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సింగరేణి సంస్థతో చర్చించండి

బొగ్గు కొనుగోలుకు సంబంధించి సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వశాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని, కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.


Next Story

Most Viewed