- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ సాగు విధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులను అవలంభించాలని సంబంధిత వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆధునిక సాగు పద్ధతుల అధ్యయనం కోసం ఇజ్రాయిల్లో పర్యటించాలని చెప్పారు. రాష్ట్రంలో పప్పుదినుసులు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పప్పుదినుసులు, నూనెగింజలు సాగు చేసే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అదేవిధంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని, మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ జారీ సులభతరంగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు వేదికలను కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. రైతు వేదికలను మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.